Rapid TV - Andhra Pradesh / Anakapally : టిక్కెట్టు రాకపోవడంతో తీవ్ర నిరాశకు లోనైన పరుచూరి తీవ్ర నిరాశలో అభిమానులు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ పరుచూరి భాస్కరరావు నీ కాదని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు అనకాపల్లి నియోజకవర్గ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కొణతాల రామకృష్ణ ప్రకటించడం కొంత నిరాశకు లోను చేసిందని పరుచూరి భాస్కరరావు అన్నారు. అయినా పార్టీ సిద్ధాంతాలకు పార్టీ అధినేత నిర్ణయానికి కట్టుబడి జన సేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ గెలుపుకు పని చేస్తానని అన్నారు. తన అభిమానులు జనసైనికులు అందరూ అధినేత నిర్ణయానికి కట్టుబడి జనసేన అభ్యర్థి కొణతాలను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో ఏ జనసేన నాయకులు చేయని విధంగా అనకాపల్లిలో గ్రామ గ్రామంలో జన సైనికులను తయారుచేసి ప్రతి ఇంటికి జనసేన జెండాను ఎగరవేసి అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి పూర్తిగా కృషి చేశానని పరుచూరి అన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి నియోజకవర్గ జనసైనికులు పరుచూరి భాస్కరరావు అభిమానులు పాల్గొన్నారు
Admin
Rapid TV