Rapid TV - Andhra Pradesh / Anakapally : నారా చంద్రబాబు నాయుడు గారికి అనకాపల్లి ఎంపి సీ.ఎం రమేష్ శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయిన నారా చంద్రబాబు నాయుడు గార్ని,అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సిఎం రమేష్ ప్రత్యేకంగా అభినందించారు.మంగళవారం విజయవాడలో చంద్రబాబును కలిసిన సీఎం రమేష్ పుష్ప గుచ్చాన్ని అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సిఎం రమేష్ మాట్లాడుతూ ఎన్డీయే కూటమి విజయం దేశం మొత్తానికి స్ఫూర్తినిచ్చిందని,కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకువెళ్ళాలని కోరారు.గత ప్రభుత్వ హయాంలో ప్రజలు అనేక అగచాట్లకు గురయ్యారని, నూతన ముఖ్యమంత్రి కానున్న చంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటయ్యే కూటమి ప్రభుత్వం అభివృద్ధిని,సంక్షేమాన్ని సమాంతరంగా నడిపి,ప్రజలకు మంచిపాలన అందివ్వాలని సీఎం రమేష్ ఆకాంక్షించారు. కూటమి భాగస్వాములైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల సహాయ సహకరాలతో,చంద్రబాబునాయుడు గారి సుదీర్ఘ రాజకీయ అనుభవంతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి తో పయనిస్తుందన్న ఆశాభావాన్ని రమేష్ వ్యక్తం చేశారు
Admin
Rapid TV