Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ చోడవరం రావికమతం: మండల కేంద్రం రావికమతంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు విశాఖ డైరీ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి సర్పంచ్ మంగం మోది నాయుడు ఎంపీటీసీ వేపాడ నాగేశ్వరరావు తెలుగు యువత మండల శాఖ అధ్యక్షులు ఉప్పులూరి నాగేశ్వరరావు తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ నాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చేటారని ప్రాతీయ పార్టీల ప్రాముఖ్యతను గుర్తించేలా జాతీయ పార్టీలకు దిశా నిర్దేశం చేసారని అన్నారు. పేదలకు కూడు గూడు నీడ అనే నినాదంతో పార్టీని స్థాపించి నేటికీ ఆ పార్టీ మనుగడకు కారణమైన ఆయన కారణజన్ముడని అన్నారు కార్యక్రమంలో పార్టీ రావికమతం శాఖ అధ్యక్షులు గంజి ఈ శ్వరరావు లోకేష్ యువత అధ్యక్షులు అప్పలనాయుడు పలువురు కార్యకర్తలు వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.
Admin
Rapid TV