Friday, 31 July 2026 09:10:33 AM
# మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్

ఎస్ .రాయవరం లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.

జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో లో సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పన్న

Date : 26 January 2024 12:48 PM Views : 343

Rapid TV - Andhra Pradesh / Anakapally : ఎస్.రాయవరం : మండలంలోని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నక్కపల్లి సర్కిల్ కార్యాలయం అడ్డురోడ్డు పోలీస్ స్టేషన్ వద్ద సర్కిల్ ఇన్స్పెక్టర్ జి.అప్పన్న ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్కిల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థుల చే జనగణమన గీతం అలపించారు.అంతకుముందు సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పన్న మాట్లాడుతూ మా కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరణ చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు.అలాగే పోలీస్ ఉద్యోగం అంటే ప్రజలకు సేవ చేసే ఉద్యోగం అని తన సిబ్బందికి తెలియజేసారు.అలాగే శాంతి భద్రత లను కాపాడే బాధ్యత మనపై ఉందన్నారు. దేశం పట్ల ప్రజల పట్ల బాధ్యత గా వ్యవహరించే వారినే పోలీస్ గా గుర్తిచి ఆ భగవంతుడు కూడా ఈ వ్యక్తులు పోలీస్ గాఉండాలని నిర్ణయిస్తాడన్నారు. అలాంటి అవకాశం వచ్చిన మనం ఆ బాధ్యత ను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. ఖాకి బట్టలు వేసుకున్న ప్రతీ ఒక్కరూ తమ వృత్తి పట్ల బాధ్యత గా వ్యవహరించాలని కోరారు. ఆయన వెంట ట్రాఫిక్ ఎస్.ఐ రామకృష్ణ ఉన్నారు.అలాగే మండల కేంద్రం ఎస్.రాయవరం లో తహశీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జెండాను తహశీల్దార్ విజయకుమార్ ఆవిష్కరించారు. ఆయనతో పాటు డిప్యూటీ తహసీల్దార్ శ్యామ్ ,ఆర్.ఐ లు వినయ్ ,మణికంఠ లతోపాటు సర్వేయర్ మూర్తి ,వి.ఆర్.ఓ లు రెవిన్యూ సిబ్బంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.

B.V.V. SATYANARAYANA S. RAYAVARAM

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :