Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి మైనింగ్లో నా ప్రమేయం లేదు .... సీఎం రమేష్ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న మైనింగ్ లో నా ప్రమేయం ఏమీ లేదని అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ అన్నారు .స్థానిక బైపాస్ రోడ్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నట్లు ఎక్కడైనా మైంనిగ్ లో తన ప్రమేయం ఉన్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని బహిరంగ సవాల్ విసిరారు .వైసీపీ నాయకులు అమర్నాథ్ .ధర్మశ్రీ ఆ వాకులు చవాకులు పేలుతున్నారని అది అంతా అబద్ధమని చెప్పారు. మీడియా ఆధ్వర్యంలో ఎటువంటి చర్చకైనా సిద్ధమని ప్రకటించారు. అనకాపల్లిని అభివృద్ధి చేస్తుంటే చూడలేక ఓర్వలేక తనపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేష్ పాల్గొన్నారు
Admin
Rapid TV