Rapid TV - Andhra Pradesh / Anakapally : *రాంబిల్లి మండలంలో వైసీపీకి భారీ షాక్* *రాంబిల్లి మండలానికి చెందిన కొత్తూరు గ్రామం అధికార పార్టీ ఎంపీటీసీ సభ్యులు సేనాపతి సన్యాసిరావు అలాగే ఇదే మండలానికి చెందిన దిమిలి గ్రామం సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ నగిరెడ్డి వెంకటరమణ అధికార పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన తీర్థం పుచ్చుకున్నారు అచ్యుతాపురం లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఎలమంచిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే కన్నబాబు రాజు పై విసిగి చెందిన వీరు అతి తొందరలో వీరి అనుచర వర్గాలను జనసేన పార్టీలోకి తీసుకు వస్తున్నట్లు తెలియజేశారు వచ్చే ఎన్నికలలో సుందరపు విజయ్ కుమార్ ని సుమారు 50000 పైచిలుకు ఓట్ల మెజార్టీ తో శాసన సభ్యులుగా గెలిపించుకొని కన్నబాబు రాజుకి తగిన గుణపాఠం చెప్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సీతపాలెం బుజ్జి, బొడ్డేటి భాస్కరరావు, ద్వారపు రెడ్డి బాపు (బాబ్జి) రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి డ్రీమ్స్ నాయుడు, సీనియర్ నాయకులు పైల రామునాయుడు తదితరులు పాల్గొన్నారు*
Reporter
Rapid TV