Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : అరకు ఎమ్మెల్యే గా రేగం మత్స్యలింగం విజయం అరకు ఎమ్మెల్యేగా వైసీపీ పార్టీ నుండి పోటీ చేసిన రేగం మత్స్యలింగం విజయం సాధించారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి వి అభిషేక్ రేగం మత్స్యలింగం కు డిక్లరేషన్ పత్రం ను అందించారు. కాగా మంగళవారం జరిగిన ఎన్నికల కౌంటింగ్ లో రేగం మత్స్యలింగం తమ సమీప కూటమి ( బి జె పి ) అభ్యర్థి పాంగి రాజారావుపై 31,877 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు . మొదటి రౌండ్ నుండి చివరి రౌండు వరకు రేగం మత్స్యలింగం మెజార్టీ సాధిస్తూనే వచ్చారు. రాష్ట్రంలో ఎన్ డి ఏ కూటమి సునామి సృష్టించినప్పటికీ, అరకులో మాత్రం వైసిపి పార్టీ నుండి పోటీ చేసిన రేగం మత్స్యలింగం విజయం సాధించారు. దీంతో అరకులోయ నియోజకవర్గంలో వైసిపి పార్టీ నాయకులు, రేగం మత్స్యలింగం అనుచరులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేసారు.
Reporter
Rapid TV