Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ అనకాపల్లి:: స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో శనివారం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచిన పోలీస్ అధికారులు. ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా, నేడు అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో అదనపు ఎస్పీ శ్రీ ఎం.దేవ ప్రసాద్ గారి నాయకత్వంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, కార్యాలయ సిబ్బంది చురుకుగా పాల్గొన్నారు. అదనపు ఎస్పీ గారు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ యొక్క ప్రాధాన్యాన్ని వివరించుతూ, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం సమాజానికి మన ప్రధాన బాధ్యత అని చెప్పారు. పోలీసులు క్రమశిక్షణతో ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆత్మసంతృప్తిని పొందే అవకాశం ఉంటుందని, సమాజ అభివృద్ధికి తోడ్పడాలని పేర్కొన్నారు. అంతేకాక, కార్యాలయ సిబ్బందిని డస్ట్ బిన్ల వినియోగానికి అలవాటు పడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్.బి. డీఎస్పీ శ్రీ బి.అప్పారావు, ఇన్స్పెక్టర్ టీ.లక్ష్మి, ఎస్సైలు రమణయ్య, వెంకన్న, ఆదినారాయణ, కామేశ్వరరావు తో పాటు పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Rapid TV