Thursday, 30 July 2026 06:54:41 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం

Date : 07 June 2026 01:48 PM Views : 167

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ న్యూస్ రావికమతం : సీడ్ బాల్స్ శిక్షణ కార్యక్రమాన్ని అనకాపల్లి డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎం సోమసుందరం ఆదివారం మండలం లోని మరుపాక నర్సరీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు అనకాపల్లి సామాజిక అటవీశాఖ పరిధి లో ఎనిమిది లక్షల సీడ్ బాల్స్ విత్తనాలు తయారు చేయాల్సి ఉందని అన్నారు. ఈ అంశంపై చోడవరం, రావికమతం మండలం మరుపాక నర్సీపట్నంలో శిక్షణ కార్యక్రమాలను చేపట్టామని శిక్షణ అనంతరం వెంటనే మట్టి, పేడ బొగ్గు పౌడర్ లతో కలిపి సీడ్ బాల్స్ తయారు చేస్తున్నారని ఎనిమిది రకాల విత్తనాలను ఈ కార్యక్రమంలో వినియోగిస్తున్నామన్నారు. వర్షాకాలం ప్రారంభమయ్యాక డ్రోన్ సహాయంతో గాని హెలికాప్టర్ సహాయంతో గానీ ప్రభుత్వం నిర్ణయం మేరకు అటవీ పరిధిలో వీటిని చల్లుతామని వర్షాలు పడిన తర్వాత ఈ కార్యక్రమం జరుగుతుందని తద్వారా సహజ సిద్ధమయిన ఫారెస్ట్ పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చోడవరం సామాజిక అటవీ పరిధి అధికారి జగదీష్ చోడవరం మాడుగుల సెక్షన్ అధికారి జె. రమణ సిబ్బంది ఎస్. కొండలరావు వన సేవకులు పాల్గొన్నారు. అనంతరం రావికమంతం మండల కేంద్రంలోని ఇటీవల పెద్దిరాజు చెరువు పై చెరువు గట్లపై వేసిన మొక్కలను ఆయన పరిశీలించి తగు సూచనలు చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. మృతి చెందిన మొక్కలువద్ద వర్షాలు పడిన వెంటనే మరలా మొక్కలు వేయాలని సాసర్ వర్క్ చేయాలని సూచించారు.

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :