Rapid TV - Andhra Pradesh / Anakapally : శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి విగ్రహ ప్రతిష్ట శతజయంతి మహోత్సవ సందర్భంగా రెండవ పౌర్ణమి ఫాల్గుణ పౌర్ణమి మార్చి 24 ఆదివారం అనకాపల్లి శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని ప్రతిష్టా జయంతి ఉత్సవాల చైర్మన్ కోరుకొండ బుచ్చిరాజు కో చైర్మన్ డా. గ్రంథి శేషు కుమార్ తెలియజేశారు. ఆదివారం ఉదయం 5:30 గంటలకు నగర సంకీర్తన కార్యక్రమంతో ఈ పూజా కార్యక్రమాల ప్రారంభమవుతాయని ఏడున్నర గంటలకు గోపూజ జరుగుతుందని, అదే రోజు ఉదయం 8:30 గంటల నుండి అమ్మవారికి అభిషేకం, ద్వాదశ కలశ స్వపనము మరియు 9:30 గంటలకు మూలమంత్ర మహా హోమము, నిరాజన మంత్రపుష్పములు తీర్థ ప్రసాదాలు వితరణ జరుగుతాయని తెలియజేశారు. అదేరోజు సాయంత్రం 6:30 గంటలకు దేవాలయ ముఖ మండపంలో శ్రీ దుర్గారావు గారి బృందం శ్రీ ఎం.ఎస్.రామారావు గారి సుందరాకాండ పారాయణం జరుగునని తెలియజేశారు. అనంతరం రాత్రి 8 గంటలకు ప్రసాదం వితరణ కార్యక్రమం జరుగునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆశిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు బిళ్ళపాటి కృష్ణకుమార్, కార్యదర్శి కొరుపోలు జగదీశ్వరరావు కోశాధికారి శ్రీధరాల సోమరాజు, ఉత్సవ కమిటీ చైర్మన్ ఉప్పల శ్రీనివాసరావు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఫైల్ ఫొటో
Admin
Rapid TV