Rapid TV - Andhra Pradesh / Anakapally : కొణతల గెలుపు - అనకాపల్లి అభివృద్ధికి మలుపు అని మళ్ళ సురేంద్ర అన్నారు. జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా అనకాపల్లి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణను గెలిపించాలని బీసీ సాధికారిక రాష్ట్ర కన్వీనర్ మళ్ళ సురేంద్ర ఇంటింటి ప్రచారం చేశారు. అందులో భాగంగా ఆదివారం ఆయన అనకాపల్లి గవరపాలెం 81వ డివిజన్, పాత 19 వ వార్డ్ సంతోష్ మాత గుడి, ప్రాంతంలో అనకాపల్లి ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి కొణతల రామకృష్ణ ను గెలిపించాలని కోరారు. డివిజన్ ఇంచార్జ్, బీసీ సాధికారిక రాష్ట్ర కన్వినర్ మళ్ళ సురేంద్ర ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి, మన ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ గ్లాస్ గుర్తుపై పోటీ చేస్తున్నారని, తెలుగుదేశం, జనసేన, బిజెపి, ఉమ్మడిగా బలపరిచిన అభ్యర్థి అయిన రామకృష్ణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కొణతాల రామకృష్ణ అనకాపల్లి ఎంపీగా, మంత్రిగా, అనకాపల్లి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, అటువంటి వ్యక్తిని వచ్చే ఎన్నికల్లో మనమందరం గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే తద్వారా అనకాపల్లి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మల్ల గణేష్, కాండ్రేగుల ఉమా, కొణతాల అప్పలరాజు, మల్ల రామకృష్ణ, పొలిమేర నాయుడు, వానపల్లి కోటేశ్వరరావు, పీలా రాముడు, బుద్ధ రాజేష్, మద్దాల నారాయణరావు,పీలా రమణారావు, నర్సింగరావు, బుద్ధ శివ, సిలపరిశెట్టి శ్రీనివాసరావు,పెతకం శెట్టి వెంకట్రావు,దాడి వాసు, బుద్ధ శివ,చదరం శివ అప్పారావు, దాడి బుజ్జి, బొడ్డేడ రాజా, కోరుబిల్లి నాయుడు, భాస్కర రావు, అధిక స్థాయిలో ఉమ్మడి పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
Admin
Rapid TV