Rapid TV - Andhra Pradesh / Anakapally : *అనకాపల్లి జిల్లా : యలమంచిలి, నియోజకవర్గం మడుతూరు జనసేన పార్టీ క్రియాశీల సభ్యుడికి ప్రమాద బీమా ₹50000 తో ఆర్థిక భరోసా* *అచ్యుతాపురం మండలం మడుతూరు గ్రామానికి చెందిన జన సైనికుడు గాలి గణేష్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. తను గత సంవత్సరం క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నాడు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టిన క్రియాశీలక సభ్యత్వం ద్వారా ప్రమాద బీమా 50 వేల రూపాయలను ఎలమంచిలి శాసనసభ్యులు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ సుందరపు విజయకుమార్ నేడు తన క్యాంప్ ఆఫీసులో చెక్కు అందజేశారు. నియోజకవర్గంలో ప్రతి జనసైనికుడు ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి మోటూరు శ్రీవేణి, అచ్యుతాపురం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బైలపూడి శ్రీ రామదాసు, బలిరెడ్డి పూర్ణ, కొత్తపల్లి సన్యాసినాయుడు మార్లపల్లి సుజాత తదితరులు పాల్గొన్నారు*.
Reporter
Rapid TV