Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV నర్సీపట్నం : మండలంలోని చెట్టుపల్లిలో నర్సీపట్నం డిఎస్పీ పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామస్తులతో సోమవారం రాత్రి మైత్రి సమావేశం నిర్వహించారు. రోడ్డు భద్రత, మరియు చట్టాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామ పెద్దలు, సుమారు 200 మంది గ్రామస్తులు, ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలకు ప్రధానంగా వాహనదారుల నిర్లక్ష్యం, మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, ఓవర్ లోడింగ్ వంటివి రోడ్డు ప్రమాదాలకు దారితీస్తాయన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల కుటుంబాలు ఎదుర్కొనే నష్టాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. అలాగే భారతీయ కొత్త చట్టాలు, సైబర్ క్రైమ్ వల్ల కలిగే నష్టాలు, గంజాయి రవాణా- నివారణ వంటి అంశాలపై సమగ్రంగా వివరించారు. గ్రామస్తుల సహకారంతో రూరల్ పోలీసుల మైత్రి సమావేశం విజయవంతమైంది. ఈ సమావేశంలో రూరల్ సీఐ ఎల్ రేవతమ్మ, ఎస్. ఐ పి రాజారావు, సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Rapid TV