Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : రాపిడ్ టీవీ అరకు : గుజరాత్ నడియాడ్ జంక్షన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఈనెల 10వ తేదీ నుండి జరగనున్న 68 వ ఎస్ జి ఎఫ్ ఆర్చరీ జాతీయ స్థాయి పోటీలకు ముగ్గురు అరకు క్రీడా పాఠశాల విద్యార్థులు ఎంపికేసినట్లు క్రీడా పాఠశాల ప్రిన్సిపల్ పిఎస్ఎన్ మూర్తి, కోచ్ లకే సూరిబాబు తెలిపారు. శుక్రవారం విలేకరులతో వారు మాట్లాడుతూ ఈనెల 10వ తేదీ నుండి జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు అరకు క్రీడా పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపికైనట్లు చెప్పారు. కాగా జోగిం పేట డాక్టర్ అంబేద్కర్ గురుకులం పాఠశాల లో ఈనెల 3, 4, 5 తేదీలలో జరిగిన 68 వ ఎస్ జి ఎఫ్ ఆర్చరీ రాష్ట్రస్థాయి పోటీలలో అండర్ -14, అండర్ - 17 విభాగాలలో అరకు క్రీడా పాఠశాల కు చెందిన 5 గురు విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు. వారిలో ముగ్గురు విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారని తెలిపారు. అండర్ 14 ఇండియన్ రౌండ్స్ విభాగంలో 6 తరగతి చదువుతున్న వి లలిత్ సాయి తేజ బ్రాంచ్ మెడల్ సాధించాడని , అలాగే 10వ తరగతి చదువుతున్న ఎస్ జై ప్రసాద్ అండర్ 17 ఇండియన్ గ్రౌండ్లో బ్రాంచ్ మెడల్ సాధించినట్లు చెప్పారు. అంతే కాకుండా అండర్ 17 రౌండ్ రీ కార్వ్ విభాగంలో డి గౌతమ్ బుద్ధ దేవ్ బ్రాంచ్ మెడల్ సాధించినట్లు తెలియజేశారు. ఇదిలా ఉండగా జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్, కోచ్, సిబ్బంది అభినందించారు .
Reporter
Rapid TV