Saturday, 13 June 2026 06:24:45 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు అరకు క్రీడా పాఠశాల విద్యార్థులు ఎంపిక

Date : 09 November 2024 12:11 AM Views : 253

Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : రాపిడ్ టీవీ అరకు : గుజరాత్ నడియాడ్ జంక్షన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఈనెల 10వ తేదీ నుండి జరగనున్న 68 వ ఎస్ జి ఎఫ్ ఆర్చరీ జాతీయ స్థాయి పోటీలకు ముగ్గురు అరకు క్రీడా పాఠశాల విద్యార్థులు ఎంపికేసినట్లు క్రీడా పాఠశాల ప్రిన్సిపల్ పిఎస్ఎన్ మూర్తి, కోచ్ లకే సూరిబాబు తెలిపారు. శుక్రవారం విలేకరులతో వారు మాట్లాడుతూ ఈనెల 10వ తేదీ నుండి జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు అరకు క్రీడా పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపికైనట్లు చెప్పారు. కాగా జోగిం పేట డాక్టర్ అంబేద్కర్ గురుకులం పాఠశాల లో ఈనెల 3, 4, 5 తేదీలలో జరిగిన 68 వ ఎస్ జి ఎఫ్ ఆర్చరీ రాష్ట్రస్థాయి పోటీలలో అండర్ -14, అండర్ - 17 విభాగాలలో అరకు క్రీడా పాఠశాల కు చెందిన 5 గురు విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు. వారిలో ముగ్గురు విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారని తెలిపారు. అండర్ 14 ఇండియన్ రౌండ్స్ విభాగంలో 6 తరగతి చదువుతున్న వి లలిత్ సాయి తేజ బ్రాంచ్ మెడల్ సాధించాడని , అలాగే 10వ తరగతి చదువుతున్న ఎస్ జై ప్రసాద్ అండర్ 17 ఇండియన్ గ్రౌండ్లో బ్రాంచ్ మెడల్ సాధించినట్లు చెప్పారు. అంతే కాకుండా అండర్ 17 రౌండ్ రీ కార్వ్ విభాగంలో డి గౌతమ్ బుద్ధ దేవ్ బ్రాంచ్ మెడల్ సాధించినట్లు తెలియజేశారు. ఇదిలా ఉండగా జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్, కోచ్, సిబ్బంది అభినందించారు .

HARI ARAKU

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :