Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి నుండి అచ్చుతాపురం రోడ్డు పునర్నిర్మాణం వెంటనే చేపట్టాలి.. అనకాపల్లి నుండి అచ్చుతాపురం వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణం వెంటనే చేపట్టాలని, సిఐటియు అనకాపల్లి కమిటీ ఆధ్వర్యంలో సోమవారం అనకాపల్లి బైపాస్ వద్ద మానవహారం నిర్మించి రాస్తారోకో నిర్వహించారు. అనకాపల్లి బైపాస్ నుండి అచ్యుతాపురం వెళ్ళు ప్రధాన రహదారి గత పదిహేళ్లుగా గోతుల మయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, కంపెనీలకు అతి భారీ వాహనాల రాకపోకలతో రోడ్లు ధ్వంసం అవుతున్నాయనీ, రోడ్ల పై ప్రయాణిస్తున్న వాహనదారులు తరచూ ప్రమాదాలై గాయాల పాలవుతున్నారనీవాహనాలు తరచూ రిపేర్లు అవుతున్నాయని అధికారులకు ఎన్ని మార్లు విన్నవించిన చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుగానే ఉంది. అతి భారీ వాహనాలు ఈ రోడ్ల పై తిరగడానికి అనుమతి నిషేదించాలని, రోడ్ని శాశ్వత ప్రాతిపదికన పునర్నిర్మాణం చేసి డబల్ రోడ్డు గా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టాలని తరచూ మంత్రులు ఎమ్మెల్యేలు రోడ్డు నిర్మాణానికి కోట్లు ఇస్తున్నామని ప్రకటన చేస్తున్న ఎక్కడ అమలు కావడం లేదని, కావున తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ .శంకరరావు, సిపిఎం పార్టీ అనకాపల్లి మండలం కన్వీనర్ గంటా శ్రీరామ్ బి.ఉమామహేశ్వరరావు, కాళ్ల తేలయ్య బాబు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు శివాజీ, రాము, చలపతి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
Admin
Rapid TV