Rapid TV - Andhra Pradesh / Vishakhapatnam : పెందుర్తి /మింది:రాపిడ్ న్యూస్ : స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని మింధి గ్రామం ప్రైమరీ పాఠశాలలో స్కూల్ కమిటీ చైర్మన్ గొర్ల సావిత్రి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జర్నలిస్ట్ ఫెడరేషన్ విశాఖ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ బ్రిటిష్ వారి దాస్య సంకెళ్లు నుండి భారతావని విముక్తి చేసిన ఆనాటి పోరాటయోధుల స్ఫూర్తితో ముందుకు సాగాలని యువతకు పిలుపునిచ్చారు. భారతదేశానికి స్వాతంత్ర్యo అందజేయడానికి తమ ప్రాణాలను సైతం అర్పించిన మహనీయులను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ విశాఖ జిల్లా కార్యదర్శి జి. శ్రీనివాసరావు అన్నారు. అలాగే గ్రామ పెద్దలు ఒరీ వెంకట్రావు,ఇ టి ఐ.శ్రీరాములు, రొక్కం వెంకటరావు చేతుల మీదగా ఆటల పోటీల్లో గెలుపొందిన స్కూల్ పిల్లలకు బహుమతుల అందజేసినారు.ఈ కార్యక్రమంలో హోమియోపతి డాక్టర్ శ్రీదేవి, స్కూల్ హెడ్మాస్టర్ డి.సత్యనారాయణ టీచర్స్ ఎ . శ్రీనివాసరావు,జి .జ్యోతి పి.శాంత కుమారి, పి.నిరుపమ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు ఇ టి ఐ శ్రీదేవి, జయశ్రీ,అంగన్వాడి టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV