Rapid TV - Andhra Pradesh / Anakapally : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా యువనాయకులు దాడి రత్నాకర్ ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరం మరియు శంకర్ ఫౌండేషన్ కంటి ఆస్పత్రి, రాజా ఆప్టికల్స్ కంటి ఆసుపత్రి అనకాపల్లి వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వైద్యం శిబిరాలను అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకులు గోవింద్ సత్యనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ ఏర్పాటు చేసిన కేక్ ను దాడి రత్నాకర్ మరియు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరుచూరు భాస్కరరావుతో పీలా గోవింద్ సత్యనారాయణ కట్ చేశారు. ఈ సందర్భంగా టిడిపి జనసేన నాయకులు ఒకరికి ఒకరు కేకును తినిపించుకొని తమ సఖ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కోట్ని బాలాజీ, మళ్ళ సురేంద్ర, కడ్మిశెట్టి నరసింగ రావు( సింగ్) తదితరులు పాల్గొన్నారు.
Admin
Rapid TV