Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి రావికమతం : స్వర్ణాంధ్ర స్వచ్ఛఆంద్ర కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రం రావికమతం లో ఎంపీడీవో వెంకన్న బాబు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీవో బృందం తడి చెత్త పొడి చెత్త కేంద్రం యొక్క నిర్వహణను పరిశీలించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ కూడా తడిచేత్త పొడిచేత్త కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పారిశుద్ధ్య కార్మికులకు సహకరించాలని అన్నారు అదేవిధంగా వేసవి కాలం దృశ్య ప్రతి ఒక్కరు కూడా వేసవి వేడిని తగ్గించే చర్యలను చేపట్టాలని తగు సూచనలు చేశారు పక్షులకు సమస్త జీవరాసులకు పశువులకు నీటి సదుపాయం కల్పించాలన్నారు కార్యక్రమంలో ఇ ఓ పి ఆర్ డి బానోజీరావు ఇతర శాఖల సిబ్బంది స్థానిక సచివాలయ కార్యదర్శి కృష్ణ మోహన్, రామునాయుడు ఎంజిఎన్ఆర్ఇజిఎస్ ఏపీవో తదితరులు పాల్గొన్నారు.
.
Admin
Rapid TV