Rapid TV - Andhra Pradesh / Anakapally : జూన్ 4వ తేదీన 6 న అసెంబ్లీ, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు అనకాపల్లి మండలం, శంకరం గ్రామం, కలెక్టరేట్ వద్ద గల ఫ్యూచర్ వరల్డ్ స్కూల్ లో ఓట్ల లెక్కింపు మరియు ఫలితాలు విడుదల సందర్భంగ. ముందస్తు చర్య లో భాగంగా శుక్రవారం రావికమతం మండలం, తిరుమల ఫంక్షన్ హల్ లో జరిగిన సమావేశానికి చోడవరం నియోజకవర్గoలోని చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాల వై.సి.పి., టి.డి.పి, జనసేన.బి.జె.పి మరియు ఇతర పార్టీల ముఖ్య నాయకులతో సుమారు 300 మందితో సమావేశం జరిగింది. ఈ సమావేశం లో జిల్లా ఎస్పీ గామాట్లాడుతూ కౌంటింగ్ కు ముందుగానీ, కౌంటింగ్ రోజు గాని, కౌంటింగ్ తర్వాత గాని ఏటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత చర్యలు తీసుకుంటున్నామని, కౌంటింగ్ రోజు 144 సెక్షన్, 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ ముగిసిన తర్వాత ఎటువంటి ఊరేగింపులు, ర్యాలీలు చేయకూడదని, ఎవరు కూడా గుంపులుగా ఉండకూడదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించబోమని, ప్రజలందరూ సంయమనంతో వ్యవహరిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ మండల రాజకీయ పార్టీల నాయకులకు సూచించారు.ఎవరైనా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఎవరైనా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన, ఘర్షణలకు పాల్పడిన కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఇతర సమయాలలో నమోదు చేసే కేసులు కన్నా, ఎన్నికల సమయంలో నమోదు చేసే కేసుల యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. సమావేశంలో అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఎస్.అప్పల రాజు, కొత్తకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్.అప్పల నాయుడు, చోడవరం ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాస రావు, ఎస్సై లు కె.లక్ష్మణరావు, డి.ధనుంజయ నాయుడు మరియు వివిధ మండలాల రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు.
Admin
Rapid TV