Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి అనకాపల్లి జిల్లా పెందుర్తి : పరవాడ మండలం గొర్లివానిపాలెం గ్రామంలో పెందుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీ భరత్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు పాల్గొన్నారు. వారి ఇరువురి చేతుల మీదుగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ నిబద్దత, క్రమశిక్షణతో కష్టపడి పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీ అండ లేకుండా ఏ ఒక్కరికీ గుర్తింపు రాదన్నారు. బూత్, క్లస్టర్, యూనిట్, కుటుంబ సాధికార సారథులను కమిటీలను పూర్తి చేయాలని అన్నారు. పార్టీ కష్ట కాలంలో జెండా మోసిన ప్రతి కార్యకర్తకి తగిన గౌరవం గుర్తింపు లభిస్తుందన్నారు. నియోజకవర్గంలో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలి. సమస్యలు ఏమైనా ఉంటే నియోజకవర్గ ఇన్చార్జి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పరవాడ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలు నాయకులు కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
Rapid TV