Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV, నర్సీపట్నం : అనారోగ్యంతో బాధపడుతున్న బాధితుడికి నర్సీపట్నంలోని స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో బుధవారం గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందజేశారు. నర్సీపట్నం మండలం అమలాపురం గ్రామానికి చెందిన శెట్టి స్వామినాయుడుకు రూ.56,043/- విలువైన చెక్కును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా గౌరవ స్పీకర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయనిధి అనేక పేద కుటుంబాలకు ఆపద సమయంలో ఆశ్రయంగా మారిందన్నారు. గత పది నెలల్లో నియోజకవర్గంలోని 25 మందికి పైగా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మండల అధ్యక్షుడు శ్రీ రంగంస్వామి, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV