Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ, అనకాపల్లి:: జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారంతా విద్యార్థి దశ నుంచి వచ్చినవారేనని, అందుకే విద్యార్థి దశలోనే ఉత్తమ విలువలను విద్యార్థులు అలవర్చుకోవాలని విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్ జాయింట్ డెవలప్మెంట్ కమిషనర్ రోషిని అపరంజిని ఐఏఎస్ అన్నారు. అనకాపల్లి లో దాడి ఇంజనీరింగ్ ఆఫ్ టెక్నాలజీ (డైట్) కళాశాలలో గురువారం జరిగిన వైబ్రే0ట్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖపట్నం స్పెషల్ ఎకనమిక్ జోన్ జాయింట్ డెవలప్మెంట్ కమిషనర్ రోషిణి అపరంజిని, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ టెన్కో యూస్ఎ,డైట్ కళాశాల కరెస్పాండెంట్ దాడి రత్నాకర్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముఖ్య అతిథులను డైట్ కళాశాల కరస్పాండెంట్ దాడి రత్నాకర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జాయింట్ డెవలప్మెంట్ కమిషనర్ అపరంజనీ చేతుల మీదుగా అవార్డులను అందజేయడం జరిగింది.అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థి మరియు తల్లిదండ్రులను డైట్ కళాశాల కరస్పాండెంట్ దాడి రత్నాకర్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.
Admin
Rapid TV