Thursday, 30 July 2026 09:22:04 AM
# గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు

ఏటి గైరంపేట గ్రామంలో కొత్త చట్టాలపై పోలీసుల అవగాహన సదస్సు

Date : 16 May 2025 04:11 PM Views : 211

Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV, నర్సీపట్నం : గొలుగొండ మండలంలోని ఏటి గైరంపేట గ్రామంలో శుక్రవారం నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్ రేవతమ్మ ఆధ్వర్యంలో గొలుగొండ ఎస్సై రామారావు నేతృత్వంలో శక్తి బృందం సహకారంతో గ్రామస్తులకు కొత్త చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాక గంజాయి వ్యాపార నివారణపై పలు సూచనలు చేశారు. ఏటిగైరంపేట గ్రామం ఏజెన్సీ ప్రాంతానికి ముఖ ద్వారంగా ఉండటంతో, గంజాయి వ్యాపారం ఈ ప్రాంతం పరిధిలో ఎక్కువగా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో గంజాయి వ్యాపారం వలన కలిగే కష్టాలు , చట్టపరమైన చర్యలు, ఎదుర్కొనే శిక్షలు, వారి కుటుంబాలలో కలిగే నష్టాలను గ్రామస్తులకు వివరించారు. ఈ సందర్భంగా గంజాయి వ్యాపారంలో సంబంధాలు కలిగి ఉన్నవారందరికీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. చట్ట విరుద్ధంగా గంజాయి సాగు, రవాణా, నిల్వ లేదా సరఫరా చేసిన వారిపైనా, వారితో స్నేహం లేదా సంబంధం కొనసాగిస్తున్నవారి పైనా,గంజాయి రవాణాకు తమ వాహనాలు లేదా ఇతర సహాయం అందిస్తున్నవారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని స్పష్టం చేశారు. అదేక్రమంలో గంజాయి వ్యవహారాల్లో నేరుగా లేదా పరోక్షంగా పాల్గొనేవారిపై పి డి యాక్ట్ నమోదు చేసి, వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభించబడుతుందని తెలిపారు.

గ్రామస్థులు చట్టాలను గౌరవిస్తూ పోలీసులకు సహకరించి, గ్రామాన్ని నేరరహితంగా మార్చడంలో భాగస్వాములవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అంతేకాక సైబర్ మోసాలపై జాగ్రత్తలు, మహిళలపై జరిగే నేరాలు నివారించే మార్గాలు, రహదారి భద్రత- ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. మహిళల భద్రత కోసం రూపొందించబడిన 'శక్తి యాప్ ' ను ప్రతీ మహిళ తప్పకుండా తమ మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలని, ఇది అత్యవసర పరిస్థితుల్లో రక్షణ కల్పిస్తుందని విజ్ఞప్తి చేశారు.

PALLA GOVINDARAO

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: