Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : రాపిడి టీవీ అరకు;:: అందాల అరకులోయ లో గత కొద్ది రోజులుగా చలి పంజా విసురుతోంది. రోజురోజుకి అరకు లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ప్రస్తుతం 12 నుండి 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విపరీతంగా పెరిగిన చలికి గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు ఉదయం, రాత్రి సమయంలో పొగ మంచు దట్టంగా కురుస్తుండడం, దానికి తోడు చలి గాలులు వీస్తుండడంతో స్థానికులు, పర్యాటకులు గజగజలాడుతున్నారు. పెరిగిన చలి నుండి ఉపసమనం పొందేందుకు చలి మంటలను ఆశ్రయిస్తున్నారు. పొగ మంచు దట్టంగా కురుస్తుండడంతో వాహన చోదకులు పగటి సమయంలో కూడా లైట్ వేసుకుని తమ ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు చలి బారిన పడకుండా తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు చెబుతున్నారు. కాగా అరకలోయ అందాలను తిలకించడానికి విచ్చేస్తున్న పర్యాటకుల మాత్రం ఇక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
Reporter
Rapid TV