Rapid TV - Andhra Pradesh / Anakapally : కొణతాలకు మద్దతుగా సినీ నటుడు పృథ్వి ప్రచారం ...అనకాపల్లి / సినీ నటుడు పృద్వి బుధవారం అనకాపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన బిజెపి టిడిపి ఉమ్మడి అభ్యర్థి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు మద్దతుగా అయన పట్టణంలోని ఉడ్డుపేట. బాలాజీ రావు పేట .తదితర ప్రాంతాల్లో పర్యటించి రామకృష్ణను గెలిపించాలని కోరారు. గ్లాస్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు .ఈ సందర్భంగా ఆయనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాడుకునీ వదిలేయటం అలవాటుగా మారిందన్నారు.. సిద్ధం సిద్ధం అనటం ఓడిపోవడానికా అంటూ ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదు అన్నారు .జనసేన టిడిపి బిజెపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. అనకాపల్లి అభివృద్ధి చెందింది అంటే అది రామకృష్ణ వల్లేనన్నారు .ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా అనేక పదవులు నిర్వహించిన అనుభవం అవగాహన కలిగిన నేత రామకృష్ణ అనీ కొనియాడారు .ఆయనను పెద్ద ఎత్తున మహిళలు యువకులు కలిసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దూలం గోపి మల్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు
Admin
Rapid TV