Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి చోడవరం: మండల కేంద్రంలో యూనియన్ బ్యాంక్ సమీపంలో ఉన్న మురుగునీటి కాలువలో ప్రమాదపుశాత్తు పడి ఒక వ్యక్తి మృతి చెందాడు. ఇతను ఏ విధంగా కాలువలో పడి మృతి చెందాడో సరైన సమాచారం లభించలేదు. స్థానికులు సమాచారం మేరకు మృతుడు రోడ్డుపై కాళీ సీసాలను ఏరుకొని జీవిస్తూ ఉండేవాడని ఇతను అనకాపల్లి చెందిన కుడుము యేసు గా స్థానికులు చెప్తున్నారు. అయితే మద్యం సేవించి కాలు గట్టిపై పడుకొని పడిపోయి మృతి చెందాడా లేదా ప్రమాదవశాత్తు పడిపోయి మృతి చెందాడా అనే కోణంపై చర్చ జరుగుతుంది. బుధవారం వేకువ ఝామున పంచాయతీ సిబ్బంది కాలువలు శుబ్రపరిచేందుకు వచ్చినప్పుడు గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు అనంతరం కాల్వ నుంచి మృతదేహాన్ని బయటికి తీశారు. పోలీసులు కేసు నమోదు చేసివిచారణ చేపట్టారు.
Admin
Rapid TV