Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV నర్సీపట్నం : నర్సీపట్నం శాఖా గ్రంథాలయం లో వేసవి శిక్షణ శిబిరం చిన్నారులను ఆకట్టుకుంటుంది. ఈ శిబిరంలో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. శనివారం శిబిరంలో గ్రంథాలయ అధికారిణి దమయంతి నీతి కథలు చదివించి చిన్నారులకు వాటిని బోధించారు. స్థానిక యువతి కృష్ణవేణి స్పోకెన్ ఇంగ్లీష్ పై శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల డ్రాయింగ్ ఉపాధ్యాయుడు చిన్నారులకు డ్రాయింగ్ నేర్పించారు. ఈ శిబిరంలో సుమారు 40 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV