Friday, 31 July 2026 10:43:20 AM
# మాడుగుల....ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి మృతి # గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయం వద్ద భజన కార్యక్రమాలు # గురు పౌర్ణమి సందర్భంగా భారీ అన్న సమారాధన # సోమలింగపాలెం లో విశాఖ డైరీ నూతన పాలక వర్గం ఎన్నిక # సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్

బొర్రా గుహలను కాపాడాలంటూ రైల్వే మంత్రికి అరకు ఎంపీ వినతి

Date : 05 August 2024 09:10 PM Views : 284

Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : అరకు రాపిడ్ టీవీ:: బొర్రా గుహలను కాపాడండి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి విన్నమించిన అరుకు ఎంపీ గుమ్మ తనుజరాణి అరకలోయ నియోజకవర్గ అనంతగిరి మండలంలో సహజ సిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలను కాపాడాలంటు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవును సోమవారం అరకు ఎంపీ గుమ్మ తనూజరాణి పార్లమెంట్లులో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందించారు. బొర్రాగుహలు పై నుంచి రెండో రైల్వే లైన్ వేసేందుకు, రైల్వే శాఖ సన్నాహాలు చేస్తుందని, దింతో బొర్రాగుహలుకు పెనూ ప్రమాదం పొంచి ఉందని కేంద్ర రైల్వే శాఖ మంత్రికి తెలియజేసినట్లు సోమవారం ఫోన్లో విలేకరులకు ఎంపీ చెప్పారు. ఇప్పటికే గుహలు పై నుంచి మొదటి లైన్ ఉందని, ఇప్పుడు రెండో లైన్ వెయ్యడంతో చరిత్ర కలిగిన గుహలను కోల్పోతామని వినతిపత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు. దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రంగా బొర్రాగుహలకు మంచి గుర్తింపు పొంది, ఎంతో ప్రఖ్యాత గాంచిందని, అలాగే ప్రముఖులు సైతం గుహలు అందాలకు మంత్రముగ్దులైనట్లుగా వివరించామని, సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు కూలిపోతే గిరిజనులు మనుగడకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. గుహలపైనే సుమారు వెయ్యి కుటుంబాలు గిరిజనులు ఆధారపడి జీవిస్తున్నారని, విన్నవించామని, గుహలు పై నుంచి రెండో లైన్ వేసే ఆలోచన విరమించుకొని, 40 మీట్లర్ దూరంగా రెండో లైన్ వేసేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసినట్లు ఎంపీ తెలిపారు. దీనిపై స్పందించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ జనరల్ మేనేజర్ తో ఫోన్ మాట్లాడారని, ముందుగా సమస్యను తెలుసుకొన్నరన్నారు. గుహలు పై నుంచి రెండో లైన్ మార్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు.

HARI ARAKU

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :