Rapid TV - Andhra Pradesh / Anakapally : జై భారత్ పార్టీ ఆత్మీయ సమావేశం ఈ నెల 24 ఆదివారం ఉదయం 9గంటలకు ప్రారంభమవుతుందని అనకాపల్లి నియోజకవర్గ కోఆర్డినేటర్ కనిసెట్టి సురేష్ బాబు తెలిపారు. జైభారత్ పార్టి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ శ్రీ.వి.వి.లక్ష్మీనారాయణ అభిమానులు శ్రేయోభిలాషులు మరియు జై భారత్ పార్టీ అభిమానులు ఈ సమావేశానికి హాజరవుతారని తెలిపారు. ఈ ఆత్మీయ సమావేశం నాలుగు రోడ్ల కూడలి దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదురుగా కోడుగంటి గోవిందరావు గారి భవనంలో గల విజయ కుమార్ హోల్ నందు నిర్వహించటం జరుగుతుంది. ఈ ఆత్మీయ కార్యక్రమంనకు ముఖ్య అతిధిగా జై భారత్ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ జయదేవ్ గారు హాజరు అవుతారని అన్నారు. అభిమానులు కార్యకర్తలు, అందరూ హాజరు కావాలసిందిగా కోరుచున్నామని సురేష్ బాబు పత్రికా ప్రకటనలో తెలియజేశారు
Admin
Rapid TV