Rapid TV - Andhra Pradesh / అల్లురిసితరమరజు : చెత్తాచెదారాలు తొలగింపు, డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభం అరకులోయ మండలం యండపల్లివలస గ్రామంలోని గంగమ్మ తల్లి గుడి ఎదురుగా ప్రధాన రహదారిలో వర్షం నీరు నిల్వ ఉండిపోవడంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు కు గురవుతున్నారు. గత కొద్దిరోజులుగా ఏజెన్సీలో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో ఈ సమస్య మరింత రెట్టింపు అయింది. దీంతో ప్రజల విన్నపం మేరకు స్పందించిన అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా మంగళవారం స్థానిక ఎంపీడీవో వెంకటేష్ ఆధ్వర్యంలో పద్మాపురం పంచాయతీ కార్యదర్శి రాంబాబు, రోడ్లు భవనాల శాఖ తరపున రుబీన్ ప్రధాన రహదారిలో నెలకొన్న సమస్య ప్రాంతానికి వెళ్లి పరిష్కారానికి చర్యలు మొదలుపెట్టారు. ప్రధాన రహదారి లో వర్షం నీరు నిలవ ఉండిపోయిన ప్రాంతం వద్ద పేరుకుపోయిన చెత్తాచెదారాలను తొలగించి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు. అలాగే వర్షపు నీరు నిల్వ ఉండకుండా రహదారి పక్కన డ్రైనేజీ నిర్మాణ పనులకు చర్యలు చేపట్టారు. గత కొద్ది నెలలుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ సమస్య పరిష్కారానికి ఎంపీడీవో వెంకటేష్ స్పందించడంతో ఎండపల్లివలస గ్రామస్తులు, వాహన చాతకులు , పాలచారులు ఆనందం చేశారు. కాగా ఇదే సమస్యపై మానవ హక్కుల నేర నిరోధక సంఘం విశాఖ ఉమ్మడి జిల్లాల అధ్యక్షురాలు కె కృష్ణకుమారి సమస్యను పరిష్కరించమని గతంలో అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఎంపీడీవో వెంకటేష్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడమే తమ లక్ష్యమని చెప్పారు. గిరిజన ప్రాంతంలో సేవ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Reporter
Rapid TV