Rapid TV - Andhra Pradesh / Anakapally : మండలం లోని కొత్తకోట గ్రామంలో మంగళవారం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తీర్థ మహోత్సవం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ శివారు ప్రదేశంలో బహిరంగంగానే కోడిపందాలు గుళ్ళాటలు అదేచ్చగా జరిగాయి. కొత్తకోట సమీప రోలుగుంట మండలంలోని పల్లి గ్రామాల నుంచి భారీ ఎత్తున కోడిపుంజులు పట్టుకొని పందెం రాయుడులు కోడి పందాలకు తరలివచ్చారు, బహిరంగంగానే కోడిపందాలు గుళ్ళాటలు ఆడుతున్నప్పటికీ అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం విశేషం. ఇటీవలే బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో కోడిపందాలు ఆడుతున్నప్పుడు ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకోవడం ఒకరిపై కత్తితో కోడి కత్తితో దాడి జరగడం తెలిసిందే దీనిపై జిల్లాస్థాయి పోలీస్ అధికారులు కూడా జోక్యం చేసుకొని ఆ సమస్యను పరిష్కరించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు, ఆ సమయం లో ధర్నాలు రాస్తారూకోలు జరిగి ల్యాండ్ ఆర్డర్ సమస్య నెలకొంది. ఆ సంఘటన జరిగి ఎన్నో రోజులు కాకముందే మళ్ళీ అధికారులు ఆదేశాలను బేకాతర చేస్తూ కోడిపందాలు గులాట్లు జరుగుతున్నాయి. జిల్లా స్థాయి అధికారులు జోక్యం చేసుకొని కోడిపందాలను గుళ్లాటలను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.
Admin
Rapid TV