Rapid TV - Andhra Pradesh / అనకాపల్లి : రాపిడ్ టీవీ సబ్బవరం:: డొక్కా సీతమ్మ గారిని అందరం ఆదర్శంగా తీసుకోవాలనీ సబ్బవరం సర్పంచ్ ప్రసాద్ అన్నారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలిలో పంచాయతీ పాలకవర్గం ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. చలివేందాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఒకనాడు ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ గారు చేసిన సేవలు నేటికీ మరువరానివనీ దారిని పోయే బాటసారిలను కూడా ఇంటికి పిలిచి భోజనం స్వయంగా తయారు చేసి వడ్డించి వారి ఆకలి తీర్చి పంపుతూ ఉండేది. అందుకే ఆ మహనీయురాలు నేటికీ కూడా చిరస్థాయిగా పేదల గుండెల్లో నిలిచిపోయింది .అందుకే నేడు మనం కూడా ప్రతి ఒక్కరూ తమకు అనుకూలమైన చోట చలివేంద్రo ఏర్పాటు చేసి దారిని పోయే పాదచారులకు దాహాన్ని తీర్చే కార్యక్రమం ఈ వేసవికాలంలో ప్రతి ఒక్కరు చేయాలని సర్పంచ్ ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మండల లక్ష్మణ, 5వ వార్డు మెంబర్ చిత్రాల శ్రీను, నాలుగో వార్డ్ మెంబర్లు నడిపిల్లి కోటేశ్వరరావు,ఎక్స్ సర్పంచ్ దళిమరెడ్డి శ్రీను, ఆటో యూనియన్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
Reporter
Rapid TV