Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి జిల్లా : నక్కపల్లి మండలం ,చిన దొడ్డిగల్లు లో సూక్ష్మ కళాకారుడు గట్టెం వెంకటేష్ పెన్సిల్ ముల్లు పై సూక్ష్మ ఆంజనేయ స్వామి వారి ప్రతిమ ను తయారు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ఇలాంటి సూక్ష్మ కళా చిత్రాలు 400 లకు పైగా తయారు చేశానని చెప్పారు. ఈ ఆంజనేయ స్వామి ప్రతిమను మాత్రం అయోధ్య రామ మందిరం లో బాల రాముడి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్న వేల ఈ హనుమాన్ సూక్ష్మ ప్రతిమను వారికి అందజేయాలనే ఉద్దేశ్యంతో తయారు చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే అయోధ్య రామ మందిర ప్రతినిధుల బృందం కు లేఖ రాయడం జరిగిందన్నారు.
Reporter
Rapid TV