Saturday, 13 June 2026 06:26:05 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

5 నెలల బకాయిలు చెల్లించండి మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన

Date : 21 May 2025 11:15 AM Views : 306

Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి చోడవరం : మధ్యాహ్న భోజన కార్మికులకు జనవరి నుండి బిల్లులు వేతనాలు వెంటనే విడుదల చేయాలని స్థానిక ఎంఈఓ కార్యాలయం వద్ద బుధవారం సీఐ టియు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు గూనూరు వరలక్ష్మి మాట్లాడుతూ, సకాలంలో బిల్లులు రాకపోవడంతో మధ్యాహ్న భోజన కార్మికులు ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది అని,తొమ్మిది పది తరగతులకు సంబంధించి డిసెంబర్ నెల నుండి బిల్లులు రాలేదని గత ప్రభుత్వ హయాంలో ప్రతినెల 15వ తారీకు బిల్లులు వచ్చేవని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెలలు తరబడి వేతనాలు కానీ, బిల్లులు గాని ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు. మౌలిక వసతులు లేకపోయినప్పటికీ, కార్మికులకు ఉద్యోగ భద్రత ప్రమాద బీమా సౌకర్యం కనీస వేతనాలు లేకపోయినప్పటికీ, ఇదే ఉపాధిని నమ్ముకుని పనిచేస్తున్న కార్మికులను కి అప్పుల ఊబిలోకి ప్రభుత్వం నెట్టేస్తుంది అని, రకరకాల మెనూల పేర్లతో కార్మికులపై పనిబారాన్ని పెంచుతున్న ప్రభుత్వం సకాలంలో బిల్లులు ఇవ్వడంలోని విఫలమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు జి లక్ష్మి నారాయణమ్మ ఎర్రయ్యమ్మ, బీ లక్ష్మి, దేవుడమ్మ , సత్యవతి, దేవి తదితరులు పాల్గొన్నారు

RAVI PRASAD CHODAVARAM

Admin

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :