Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టివి చోడవరం : మధ్యాహ్న భోజన కార్మికులకు జనవరి నుండి బిల్లులు వేతనాలు వెంటనే విడుదల చేయాలని స్థానిక ఎంఈఓ కార్యాలయం వద్ద బుధవారం సీఐ టియు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు గూనూరు వరలక్ష్మి మాట్లాడుతూ, సకాలంలో బిల్లులు రాకపోవడంతో మధ్యాహ్న భోజన కార్మికులు ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి నెలకొంది అని,తొమ్మిది పది తరగతులకు సంబంధించి డిసెంబర్ నెల నుండి బిల్లులు రాలేదని గత ప్రభుత్వ హయాంలో ప్రతినెల 15వ తారీకు బిల్లులు వచ్చేవని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెలలు తరబడి వేతనాలు కానీ, బిల్లులు గాని ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు. మౌలిక వసతులు లేకపోయినప్పటికీ, కార్మికులకు ఉద్యోగ భద్రత ప్రమాద బీమా సౌకర్యం కనీస వేతనాలు లేకపోయినప్పటికీ, ఇదే ఉపాధిని నమ్ముకుని పనిచేస్తున్న కార్మికులను కి అప్పుల ఊబిలోకి ప్రభుత్వం నెట్టేస్తుంది అని, రకరకాల మెనూల పేర్లతో కార్మికులపై పనిబారాన్ని పెంచుతున్న ప్రభుత్వం సకాలంలో బిల్లులు ఇవ్వడంలోని విఫలమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు జి లక్ష్మి నారాయణమ్మ ఎర్రయ్యమ్మ, బీ లక్ష్మి, దేవుడమ్మ , సత్యవతి, దేవి తదితరులు పాల్గొన్నారు
Admin
Rapid TV