Rapid TV - Andhra Pradesh / Anakapally : రాపిడ్ టీవీ అనకాపల్లి:: ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర నిర్వహించేందుకు నిర్ణయించిందని, ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా నిర్వహించడానికి ముఖ్య కారణమైన భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం, ఇతర సాయుధ దళ విభాగాల ధైర్య సాహసాలను అభినందిస్తూ, ప్రాణత్యాగం చేసి అమరులైన సైనికుల గౌరవార్థం బిజెపి అనకాపల్లి జిల్లా యూనిట్ 22 మే 2025 అనకాపల్లి పట్టణంలో తిరంగ ర్యాలీ నిర్వహించనుందని పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం. రమేశ్ తెలిపారు.గురువారం మే 22 సాయంత్రం 5 గంటలకు ఈ ర్యాలీ అనకాపల్లి సన్ క్యాస్టల్ హోటల్ సెంటర్ నుంచి ప్రారంభమై నాలుగు రోడ్ల కూడలి వద్ద ముగుస్తుందని, అనకాపల్లి యువత, మహిళలు, విశ్రాంత ఆర్మీ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నేతలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని తిరంగా ర్యాలీ ని విజయవంతం చేయాలని ఎంపీ సీఎం రమేష్ పిలుపునిచ్చారు.
Admin
Rapid TV