Saturday, 13 June 2026 06:12:02 PM
# సహజ సిద్దమయిన అడవుల పునరుద్ద రణకొరకు సీడ్ బాల్స్ తయ్యారి. ...డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ర్ ఎమ్.సోమసుందరం # అదుపుతప్పి నదిలోకి దూసుకుపోయిన అంబులెన్స్ # వి ఆర్ ఓ లావణ్య పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు # స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా 12,256 ఉద్యోగాలకు (సి జి ఎల్ )ధరఖాస్తు చివరి తేది జూన్ 22 # దేశం గర్వించే క్రీడాకారులు గా అల్లూరి జిల్లా ఎదగాలి ఎస్ పి అమిత్ బర్దార్ # బుచ్చయ్యపేట ఎస్సైగా విధుల్లో చేరిన పి మనోజ్ కుమార్ # మత్స్యకారులపై నిర్బంధాన్ని ఖండించిన సిఐటియు # అనకాపల్లిలోచిన్నారి రోహిత కిడ్నాప్ కేసును చేదించిన పోలీసులు # భారత సైన్యం కు సంఘీభావం # 50 కేజీల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ # అనకాపల్లి జిల్లాలో గంజాయి పట్టివేత, ఏడుగురు నిందితులు అరెస్టు # ఫార్మా, ఎస్ ఈ జెడ్ కార్మికుల భద్రత రక్షణకై సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల # విజయవాడ వరద బాధితులకు సహాయం చేసిన కొక్కిరపల్లి గ్రామ జ్యోతి యువత # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్)నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం # అనకాపల్లి ప్రెస్ క్లబ్ (ఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నిక # ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలింపియాడ్ పోటీల్లో సత్తా చాటిన మైలపల్లి అద్విత్ # డెంగ్యూ వ్యతిరేఖ మాసోత్సవాలు # సర్వసిద్ది పి.హెచ్.సి లో ఆకస్మిక తనిఖీలు.. # రాష్ట్ర మత్స్యకార శాఖా మంత్రి కింజారపు అచ్చినాయిడును కలసిన మోసా అప్పలరాజు . # అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఎం.దీపిక

గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన పట్టణ పోలీసులు

Date : 01 June 2025 10:02 PM Views : 206

Rapid TV - Andhra Pradesh / Anakapally : RAPID TV, నర్సీపట్నం : గంజాయిని రవాణా చేస్తున్న తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులను నర్సీపట్నం పట్టణ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నర్సీపట్నం పట్టణ సిఐ జి గోవిందరావు విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. పట్టణ పరిధిలోని పెద్ద బొడ్డేపల్లి జంక్షన్ వద్ద చోడవరం రోడ్లో పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు తనిఖీ నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా బ్యాగుతో తిరుగుతుండగా పట్టణ ఎస్ఐ రమేష్ సిబ్బందితో కలిసి వారి వద్ద నుండి బ్యాగ్ లను తనిఖీ చేయగా ఎనిమిది కేజీల గంజాయి ప్యాకెట్లలో లభించిందని సి ఐ గోవిందరావు తెలిపారు. గంజాయిని స్వాధీనం చేసుకుని, తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన కే హరీష్, యు .కన్నన్ లను అరెస్టు చేశామని ఆయన తెలిపారు . వీరిద్దరూ స్నేహితులని, గంజాయి కొనుగోలు చేసి కోయంబత్తూరులో చిన్న చిన్న ప్యాకెట్లలో అమ్మే అలవాటు ఉందని తెలిపారు .వీరిద్దరూ కోయంబత్తూరు నుండి ట్రైన్ లో మూడు రోజుల క్రితం విశాఖపట్నం చేరుకొని చీడికాడ మండలంలో గతంలో గంజాయి అమ్మే వ్యక్తులతో పరిచయం ఉన్న కారణంగా వారి వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసుకుని నర్సీపట్నం ప్రాంతానికి వస్తున్నారని తెలిపారు. పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు తనిఖీలలో గంజాయి పట్టుబడటంతో వీరిద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించామని పట్టణ సీఐ గోవిందరావు వెల్లడించారు. ఈ సమావేశంలో పట్టణ సబ్ ఇన్స్పెక్టర్లు జె రమేష్, ఉమామహేశ్వరరావు లు పాల్గొన్నారు.

PALLA GOVINDARAO

Reporter

Rapid TV

మరిన్ని వార్తలు

Copyright © Rapid TV 2026. All right Reserved.



Developed By :