Rapid TV - Andhra Pradesh / Anakapally : ఎలమంచిలి రాపిడ్ టీవీ:: అచ్యుతాపురం మండలం, మత్స్య శాఖ కార్యాలయం వద్ద, ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం జిల్లా కమిటీఆధ్వర్యంలో ఫెసిరేస్ డెవలప్మెంట్ ఆఫీసర్ రవితేజకి అర్హులైన మత్స్యకారులు అందరికీ, ప్రభుత్వం ఇస్తామన్నా 20,000 వేట నిషేధ సహాయం అందించాలని వినతిపత్రం ఇచ్చారు. ప్రతి సంవత్సరం అర్హులైన మత్యకారులకు,ఏప్రిల్,మే నెలలో వేట నిషేధ కాలంగా భావించి ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హులైన ప్రతి మత్స్యకారునికి 20000 రూపాయలు వేటనిషేధ పరిహారం అందిస్తామన్నారు. అలాగే గత వారం రోజులుగా, అల్పపీడనం, వాయుగుండం కారణంగా మత్స్యకారులు చేపలు వేటకు వెళ్లకపోవడం వలన అనేక ఇబ్బందులు పడుతున్నారు, ప్రభుత్వం మత్స్యకారులు బాధలను అర్థం చేసుకొని, తక్షణమే వేట నిషేధ సహాయంతో పాటు, తుఫాను కారణంగా నిత్యవసర సరుకులు అందించి ఆదుకోవాలని మత్స్యకారు సంఘం నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం అచ్చుతాపురం కన్వీనర్ ఆర్. రాము, జి .దేవనాయుడు చేపల తాతయ్య, చెల్లూరి నూకన్న, మైలపిల్లి రమణ, కొండ్రపు సోమనాయుడు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV