Rapid TV - Andhra Pradesh / Anakapally : నక్కపల్లి : నక్కపల్లి జాతీయరహాదారి ని అనుకొని నియోజకవర్గ జన సైనికులు ఏర్పాటు చేసిన జనసేన కార్యాలయం ను జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ ప్రారంభించారు. అంతకుముందు గణతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని నక్కపల్లి ఎస్.రాయవరం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యాలయం ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఎలాంటి సమస్యలు తలెత్తినా జనసేన అండగా ఉంటుందని పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లో పవన్ ముందుంటారన్నారు. అలాంటి మనోబావాలు కలిగిన మహోన్నతమైన వ్యక్తి తో కలిసి ప్రయాణించడం ఆనందంగా ఉందన్నారు.ప్రజలకు రానున్న రోజల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు గాను ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. అనంతరం నియోజకవర్గంలో ఇటీవల ఎంపిక చేసిన పాయకరావుపేట ,నక్కపల్లి ,కోట ఉరట్ల ,నక్కపల్లి మండలాల అధ్యక్షులతోపాటు జిల్లా కార్యవర్గం లో చోటు దక్కించుకున్న పలువురు ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో జనసేన నాయకులు ,జన సైనికులు పాల్గొన్నారు.
Reporter
Rapid TV