Rapid TV - Andhra Pradesh / Anakapally : అనకాపల్లి రాపిడ్ టీవీ ... అనకాపల్లి జిల్లా అభివృద్ధి తన ధ్యేయమని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. పెందుర్తి ఎలమంచిలి పాయకరావుపేట నియోజకవర్గాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. అనకాపల్లి జిల్లా అభివృద్ధిలో భాగంగా మార్చి 31న అచ్యుతాపురం అనకాపల్లి 100 అడుగుల రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నారని తెలిపారు .పార్లమెంటు సమావేశాల్లో ఈ ప్రాంత సమస్యలపై చర్చించడం జరిగిందన్నారు . ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమల్లో ఉన్న రెండు లక్షల ఉద్యోగాల నుండి 4 లక్షల ఉద్యోగాలు పెరిగేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పార్లమెంట్లో అరకు కాపీని పెట్టడం జరిగిందన్నారు .ఏది ఏమైనాప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యం అని సీఎం రమేష్ ప్రకటించారు .ఈ కార్యక్రమంలో ఎలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేష్ పాల్గొన్నారు
Admin
Rapid TV